మాన్యం టివి దుమ్ముగూడెం:
మండలంలోని స్టేట్ ఫారెస్ట్ అకాడమీ,హైదరాబాద్, మరియు గ్రీన్ భద్రాద్రి వారు మారుమూల గిరిజన గ్రామమైన కొమ్మనాపల్లి లో అటవీశాఖవారు గతంలో నాటిన ప్లాంటేషన్ ను మరియు అటవీశాఖ వారు నిర్మించిన చెక్ డామ్ లని పరిశీలించారు.మారు మూల అటవీ ప్రాంతంలోని కొమ్మనాపల్లి గ్రామంలో అటవీశాఖ వారు సుమారు ఇరవై హెక్టార్లలో ప్లాంటేషన్ చేసి,మొక్కలని వృక్షాలుగా మార్చడం,అదే విధంగా చెక్ డామ్ లు నిర్మించి,అటవీ జంతువుల దాహార్తి తీర్చడం,అభినందనీయమని, బోగాల శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.యఫ్.వో లు బాబు,తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారి రామ్ మోహన్ రావు,గ్రీన్ భద్రాధ్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాసరెడ్డి,లాయర్ తిరుమలరావు,ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి,వృక్షమిత్ర గోళ్ళ భూపతిరావు,శీలం రామ్ మోహన్ రెడ్డి,రేంజ్ ఆఫీసర్ జస్వంత్ ప్రసాద్,రాజేష్ ,ఫారెస్ట్ శిక్షణా సిబ్బంది,పాల్జొన్నారు..
Post A Comment: