మన్యం టీవీ మణుగూరు: మొహర్రం పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ముస్లిం ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. మంచితనానికి,త్యాగానికి మొహర్రం ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. మానవత్వాన్ని చాటుతూ అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం,మానవ హక్కుల కోసం శతాబ్ధాల క్రితం జరిగిన పోరాటమే మొహర్రం అని ఆయన తెలిపారు.ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగానికి గుర్తుకు మొహర్రం జరుపుకుంటున్నామని, ఆయన స్ఫూర్తితో ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలని విప్ రేగా కాంతారావు తెలిపారు.
Post A Comment: