*మహిళలోనే అత్యుత్తమ ఆఫీసర్ తస్లీమా సబ్ రిజిస్టర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు
*అసత్య ఆరోపణలు కుల సంఘాల పేరుతో లేనిపోని పంచాయతీలు ఆపాలని హితవు
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం కేంద్రంలో విలేకర్ల సమావేశంలో మాల మహానాడు జిల్లా యూత్ నాయకులు మోదుగు బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలోమోదుగు బాబు మాట్లాడుతూ మంగపేట మండలంలోని మాల సంఘం పేరుతో రాజమల్ల సుకుమార్ నిమ్మగడ్డ ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు సంఘం పేరుతో లేనిపోని పంచాయతీలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. నిరంతరం ప్రజాసేవలో తన వంతు పాత్ర పోషిస్తున్న సబ్ రిజిస్టర్ తస్లీమా మీద అనవసర ఆరోపణలు చేస్తూ పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. వీటిని ప్రజలు అధికారులు పత్రిక మిత్రులను నమ్మవద్దని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మైపా లాలయ్య, బోడా బొర్రయ్య,బోడా రామ చంద్రం,బోడఅచ్చలు,బోడ అబ్రహం,బోడా నాగేష్,బోడా భూషణం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: