* ప్రతి గ్రామంలో ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలి
*డీఎంహెచ్ ఓ శిరీష ఆకస్మికంగా పర్యటించి వైద్య సిబ్బందికి తగు సూచనలు
గుండాల ఆగస్టు 17 (మన్యం మనుగడ) కొత్తగూడెం జిల్లా వైద్య అధికారిని శిరీష మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. అనంతరం ఆమె ప్రాథమిక వైద్య శాల లో ని ల్యాబ్ మరియు కాన్పుల గది ని వైద్యశాల పరిసరాలను ఆమె పరిశీలించారు. అనంతరం మండలం పరిధిలోని లింగ గూడెం గ్రామంలో ఆమె పర్యటించి ఫ్రైడే డ్రై డే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎం పీ ఓ వలి, సర్పంచ్ నరసింహారావు, డాక్టర్ రవి చంద్, సిహెచ్ శ్రీహరి, ఏఎన్ఎంలు వర్కర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: