మన్యం టీవీ కరకగూడెం: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏపీఎం త్రిగుణ అధ్వర్యంలో ఎంపీడిఓ శ్రీను అధ్యక్షతన వివోఏ లకు ఐటిసి బంగారు భవిష్యత్ వాస్ ప్రోగ్రాం వారు ఘన వ్యర్థాల నిర్వహణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివోఏలకు తడి,పోడి ,ప్రమాదకర చెత్తపై శిక్షణా ఇచ్చారు. అదేవిధంగా హోం కంపోస్టు, వర్మీ కంపోస్టు ఎరువులు తయారీ విధానం పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐటిసి బంగారు భవిష్యత్తు వాస్ ప్రోగ్రామ్ ట్రైనర్లు రాంబాబు, సందీప్ వివోఏ లు పాల్గొన్నారు.
Post A Comment: