మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరునాగారం జడ్ పి ఎస్ ఎస్ గ్రౌండ్ లో సోమవారం వాల్ బార్ ప్రారంబించడం జరిగింది. డాక్టర్ వరప్రసాద్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు.దీనిని డాక్టర్.బండ్ల కృష్ణ చైతన్య జ్ఞాపకార్ధంగా డాక్టర్.వరప్రసాద్ బహూకరించడం జరిగింది. అయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కొరకు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం గా ఉందాన్నారు.పిల్లలను క్రీడాకారులను స్పోర్ట్స్ రంగంలో ముందుకు రావడానికి తల్లి తండ్రులు సాహకరించాలి కోరారు.వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ అన్ని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా దోహదపడుతుందన్నారు.
ఏటూరునాగారంలోని క్రీడాకారులు నేషనల్ లెవల్లో పార్టిసిపేట్ చేయాలనీ అయన కోరారు.ఈ కార్యక్రమంలో కోచ్ పర్వతాలు కుమారస్వామి,
పర్వతాల లాలయ్య,వావిలాల చిన్న ఎల్లయ్య,
వెంకటేశ్వర్లు,బిక్షపతి,సాంబశివరావు,సిరాజ్,శ్రీరామ్ సాంబశివరావు,రహీమ్,నరేష్ భాష,మేజర్ మహబూబ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: