మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు కు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి ఇల్లందు కు తన వాహనంలో వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే నరసయ్య రాళ్లపాడు వద్ద వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఇంతలో కొత్తగూడెం వెళ్తున్న కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు వేముల వెంకటేశ్వర్లు గమనించి వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు.కారు పల్టీ కొట్టిన ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా స్వల్ప గాయంతో గుమ్మడి గారు క్షేమంగా బయటపడడం అదృష్టం. ప్రమాదం నుండి క్షేమంగా బయటపడడం ఆయన అభిమానులకు ఊరట కలిగిస్తుంది.
ఈ ఊహించని ప్రమాదం ఎవరినైనా కొంత మానసిక ఆందోళనకు గురిచేస్తుంది.
Post A Comment: