మన్యం టీవీ కొత్తగూడెం, ఆగస్టు 17:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ గ్రామపంచాయతీ గాంధీ కాలనీ 11వ వార్డు లో వర్షం కారణంగా కాలువలు నిండడం తో నీరు వరదల రోడ్లపై ప్రవహిస్తుంది. అటుపై ప్రయాణిస్తున్న ప్రజలకు ఇబ్బంది తప్పట్లేదు. ఇదిలా ఉండగా కాలనీలో వర్షపు నీరు నిల్వ ఉండి అక్కడ పందులు కుక్కలు ఆవాసము గా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఏరియాలో పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగాయి అని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని వాపోయారు. దీనికి కారణంగా డెంగ్యూ మలేరియా విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని తక్షణమే సంబంధిత అధికారులు దీనిపై చర్య తీసుకోవాలని లేని ఎడల ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్దామని కాలనీవాసులు తెలియజేశారు.
Navigation
Post A Comment: