మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వావిలాల స్వామి మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గుంటూరు జిల్లా లో స్వాతంత్ర దినోత్సవం రోజున బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిని నడిరోడ్డుపై హత్య చేసిన ఉన్మాది చట్టపరంగా వెంటనే ఉరిశిక్ష విధించాలని మనదేశంలో స్వతంత్ర దినోత్సవం నాడు మహిళలకు భద్రత లేదంటే మన ప్రభుత్వాలు దళితుల పట్ల పాలన ఏ విధంగా ఉందో గమనించ వలసిన బాధ్యత మనపై ఉందని అగ్రవర్ణాల మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతే ప్రభుత్వాలు బాధ్యులైన వారిని వెంటనే ఎన్కౌంటర్లు చేస్తారు. ఈ సూత్రం అనగారిన వర్గాల మహిళలకు వర్తించదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మనదేశంలో ఎవరు నేరం చేసిన చట్టపరంగా శిక్షలు పడాలి తప్ప అధికారుల చేత కాదని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఆవుల సాంబశివరావు,కోళ్ల సమ్మయ్య, నాగరాజు, శంకర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: