మన్యం టీవీ ఏటూరు నాగారం
హన్మకొండ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రుల సమీక్ష సమావేశం జరుగగా ఈ సమావేశంలో ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ శాసన సభ్యురాలు సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి లింక్ రోడ్లు ఏర్పరచాలని,బీటి రోడ్లు,సీసీ రోడ్లు ఏర్పరచాలని,అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్ గారికి ములుగు జిల్లా గోదావరి నదీ జలాలు ములుగుకి వినియోగించాలని వారికి వినతి పత్రాలు అందజేశామని అన్నారు.
*కొత్తగూడ మండలంలో*
1.కొత్తపల్లి క్రాస్ నుండి ఓటాయి రోడ్డు
2.కాటి నాగారం నుండి జంగాలపల్లి రోడ్డు
3.కొత్తగూడ నుండి వెలుబెల్లి రోడ్డు
ఏటూరునాగారం మండలంలో
4. రొయ్యురు నుండి భనాజీ బంధం నుండి వయా చల్పకా రోడ్డు వరకు
5. ముళ్లకట్ట నుండి రాంపూర్ వరకు
ములుగు మండలంలో
6.కాసిందేవిపేట నుండి కన్నాయిగూడెం వరకు
7.జడ్పీ రోడ్ నుండి మదనపల్లి వరకు.
8.జగ్గన్నపేట నుండి పులిగుండం వరకు
9.రాయినిగూడెం నుండి యాపలగడ్డ వయా కొత్తూర్ వరకు.
10.దేవగిరి పట్నం నుండి కాసిందేవిపేట వరకు రామయ్య పల్లి వరకు.
లింకు రోడ్లను ఏర్పరచాలని వినతి పత్రం అందజేశామని అన్నారు.
Post A Comment: