ఢిల్లీ నుండి అశ్వారావుపేట గల్లీకి చేరిన అరుదైన పురస్కారం
మన్యంటీవీ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణం కి చెందిన సోమాని శ్రీను కోవిడ్ సమయం లో చేసిన విశేష సేవలకు మరియు సమాజం కోసం చేసిన అద్భుతమైన కృషికి మరియు దేశం కోసం విశేషమైన కృషికి తరంగ్ అంతర్జాతీయ పురస్కారాలను ప్రదానం చేసామంటూ ఎఆర్. రాజేశ్ నాథ్ ప్రజా సంక్షేమ ఫౌండేషన్ అధ్యక్షుడు, ఢిల్లీ వారు తెలుయజేశారు. అంతే కాకుండా ఆహార పంపిణీ, వస్త్ర పంపిణీ, మహిళా సాధికారత, చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలలో ముందంజలో నాయకత్వం వహించిన ఆయన చేసిన అనేకానేక సేవలను తోటివారిపట్ల ఆదరాభిమానాలు, గుర్తుచేస్తూ ఈ అరుదైన పురస్కారం ఢిల్లీ నుండి అశ్వారావుపేట వాస్తవ్యులు సోమాని శ్రీను కు దక్కడం నిజంగా తమకు గర్వాంగా ఉందని పలువురు తెలుయచేశారు. మరియు కుటుంబసభ్యులు, సోమాని స్నేహితులు , ప్రజా ప్రతినిధులు, పలువురు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
Post A Comment: