మన్యంటీవీ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, పేరాయిగూడెం గ్రామ పంచాయితీ లోని సర్పంచ్ సుమతి అద్వర్యం లో ఈ రోజు ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎఎస్ఆర్ కాలనీ లో ప్రతి ఇంటికి తిరిగి సీజనల్ వ్యాధులు గురించి తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పటం జరిగింది. నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వెయ్యటం, నీటి తొట్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేలా చెయ్యటం ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా ఉంచుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మరియు పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: