మన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం కమలాపురం గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో గొంది దివ్య 17సం తండ్రి పేరు గోపాల్ అమ్మాయి ఇంటి ముందు ఉన్నటువంటి నీటి గుంటల్లో వ్యవసాయ పనులకు వాడుకునే సంచలన క్లీన్ చేద్దామని వెళ్లి ప్రమాదవశాత్తు పడి మరణించింది తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అమ్మాయి కనపడకపోవడం తో వెతుక్కుంటూ వెళ్లి నీటి కుంట దగ్గర వెళ్లేసరికి సంచులు నీటిలో తేలడంతో అందులో దిగి వేతకగా కూతురు ఉండటంతో హుటాహుటిన స్థానిక హాస్పిటల్ కి తీసుకొని వెళ్లిన అప్పటికే మరణించిన దాని డాక్టర్ చెప్పారు.. అమ్మాయి మరణించడంతో కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు.దివ్య ఖమ్మం లో ఇంటర్ చదువుతునంది. తండ్రి గోపాల్ ఫిర్యాదు ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Post A Comment: