మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం సొసైటీ చైర్మన్ ముదునూరి డాక్టర్ రవిశేఖర్ వర్మ
కొత్తగూడెం లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ సాక్షిగా ఆదివాసీ గిరిజన ముద్దు బిడ్డ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను అవమానించడం ను తీవ్రంగా ఖండిస్తున్నామని సొసైటీ చైర్మన్ ముదునూరి డాక్టర్ రవి శేఖర్ వర్మ అన్నారు. మంత్రి తర్వాత క్యాబినెట్ మంత్రి హోదా లో మొదటి ప్రోటోకాల్ ఉన్న ప్రభుత్వ విప్ రే గా కాంతారావు ను ప్రోటోకాల్ పాటించకుండా అవమానిచడం బాధాకరమన్నారు.దీనిని ఖండిస్తున్నామన్నారు. వెంటనే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు, కుమారుడు వనమా రాఘవ ఎమ్మెల్యే రే గా కు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించనీ వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రజా ప్రతినిధుల ప్రోటోకాల్ విషయం లో భవిష్యత్తు లో ఇలా జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అయన కోరారు.
Post A Comment: