ప్రోటోకాల్ పాటించి అధికారులపై చర్యలు తీసుకోవాలి
గుండాల ఆళ్ల పల్లి ఆగస్టు 29 (మన్యం మనుగడ) ఆదివాసి ఎమ్మెల్యే అంటే అంత చులకనా అని ఆళ్ల పల్లి మండల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెం బహిరంగ సభలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ తరుణంలో అంబేద్కర్ సాక్షిగా ఆదివాసి ఎమ్మెల్యేను అవమానించడం ఎంత వరకు సమంజసమని అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవేంద్ర పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను సభ వేదికపైకి పిలవకపోవడం దానితో పాటు ఫ్లెక్సీ లో ఆయన ఫోటో ముద్రించుకోవడం ప్రోటోకాల్ ను దిక్కరించఢమే అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివాసి ఎమ్మెల్యేకు దక్కుతున్న గౌరవాన్ని చూసి తట్టుకోలేక నే ఇలాంటి కార్యక్రమాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌరవానికి భంగం కలిగించిన సహించేది లేదని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి హనుమంతు, ఎంపీపీ మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, ఉపాధ్యక్షుడు సత్యం, ఎంపీటీసీ సత్యవతి , పార్టీ నాయకులు ఖయ్యుం , ఎండి ఆదాం , సర్పంచులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: