మన్యం టీవీఏటూర్ నాగారం ప్రతి ఒక్కరూ క్రీడల పై ఆసక్తి పెంచుకోవాలిని ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.మండల కేంద్రంలో ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం రోజున ఉదయం 7.00 గంటలకు ఏటూరునాగారం వై జంక్షన్ నుండి బస్టాండ్ వరకు ఏటూరునాగారం స్పోర్ట్స్ క్లబ్ మరియు వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 2కె రన్ ను స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి పచ్చ జండా ఊపి ప్రారంభించారు. తదనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏటూరునాగారం నందు పిల్లలు,సభ్యుల సమక్షంలో కార్యక్రమ ముఖ్య అతిధి శ్రీకాంత్ ఎస్ఐ కేక్ కట్ చేసి నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత విజేతలకు ప్రధమ బహుమతి ఆర్.యశ్వంత్, ద్వితీయ సిద్ధూ, తృతీయ రోహిత్, ప్రత్యేక బహుమతి కె. మీనాల్ శ్రీలకు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమం లో కోచ్ పర్వతాల కుమార్,సభ్యులు సిరాజ్, చిటమట రఘు, పర్వతాల లాలయ్య, వావిలాల ఎల్లయ్య,వావిలాల సాంబశివరావులు,సర్దార్ పాషా,వాసంపల్లి సాంబశివరావు,శ్రీరామ్, కొయ్యడ మల్లయ్య,బి. శ్రావణ్,పి.బిక్షపతి,వి. రాజబాబు,వి.చందర్,సిహెచ్. నరేష్,గంపల నర్సయ్య, హన్మంత్,వలస మధు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: