టిఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవ రెడ్డి.
మన్యం టీవీ ఏటూరునాగారం హేతుబద్దీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బడులను మూసివేసే కుట్ర చేస్తుందని టిఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వాసుదేవ రెడ్డి అన్నారు.మండల కేంద్రంలో టిఎస్ యుటిఎఫ్ ఏటూరునాగారం మండల శాఖ అధ్యక్షుడు కొమిరెల్లి భూమి రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడులు మూతపడితే పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.కావున ప్రభుత్వం హేతు బద్దీకరణను వాయిదా వేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఇదేవిధంగా ఈకార్యక్రమానికి అతిధులుగా హాజరైన జిల్లా కార్యదర్శులు కొండా చెంచయ్య,ములకల వెంకటస్వామి మాట్లడుతూ ప్రభుత్వం వెంటనే పాఠశాలలో స్కావెంజర్లను మరియు విద్యావాలంటీర్లను నియమించాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు,మండల నాయకులు చింతోజు సుమన్, ముండ్రాతి శ్రవణ్ కుమార్,కిరణ్,మంద శ్రీనివాస్,ఎట్టి స్వరూప,పోలేం హరిత,సిందే రాజేష్,కట్ల సారయ్య,కొర్ర రాజన్న పాల్గొన్నారు.
Post A Comment: