మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ నాయకులు,లీగల్ అడ్వైజర్,ఉద్యమకారులు అడ్వకేట్ పొనుగోటి.కిషన్ రావు కరోనా నుండి కొలుకున్నందున ఆదివారం వారి ఇంటికి వెళ్లి,వారి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు. అనంతరం కిషన్ రావు శ్రీ శ్రీ మాప్రస్తానం పుస్తకాన్ని విప్ రేగా కు బహుమతి గా ఇవ్వడం జరుగింది.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొశం.నరసింహారావు,పీఏసీ ఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: