మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఓ సి-2 లో జరిగిన డంపర్ యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికులు అజ్మీరా బాషా, సాగర్,వేల్పుల చిన్న వెంకన్న ల కుటుంబాలను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు పరామర్శించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని,న్యాయం జరిగేలా చూస్తామని విప్ రేగా కాంతారావు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొశం. నరసింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,టిబిజీకేఎస్ మణుగూరు బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వుకాంటి.ప్రభాకర్ రావు,కోట.శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి. నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ నాయకులు వట్టం. రాంబాబు,హబీబ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: