CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంగ్రెస్ నాయకులారా నీచ రాజకీయాలు మానుకోండి

Share it:

 



విప్ రేగా ను విమర్శించే నైతిక విలువ మీకు లేదు


వ్యక్తిగత విమర్శలు మానుకోండి లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మణుగూరు మండల సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కారం. ముత్తయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి కానీ,వ్యక్తిగత విమర్శలు చేస్తున్న,రాజకీయం లో అనుభవం లేని కాంగ్రెస్ నాయకులు,అజ్ఞానులు గా వ్యవహరిస్తు,చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు.కాంగ్రెస్ నాయకులు మాట్లాడే పద్ధతి మంచిగా లేదు అని,కాంగ్రెస్ లో ఉన్న మూర్ఖులు మూడు గ్రూప్ లు గా ఏర్పడి,వారి ఉనికి ని కాపాడుకోవడం కోసం నిచరాజకియలు చేస్తున్నారు అని అన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో,ఎవరి బ్రతుకులు ఏంటో మాకు తెలుసు అని,మేము నోరు తెరిస్తే మీరు ఒక్క రోజు కూడా ఇక్కడ రాజకీయాలు చేయలేరు అన్నారు. మాట్లాడే పద్ధతి,భాష,యాస మార్చుకుంటే మంచిది అని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు.సర్పంచ్ కొమరం.జంపేశ్వరి మాట్లడుతూ విప్ రేగా చేసే అభివృద్ధి నీ చూసి ఓర్వలేక, వారి మనుగడ కోల్పోతున్న కాంగ్రెస్ నాయకులు చేసే విమర్శలలో నిజం లేదు అన్నారు.చిన్న విషయానికి దిష్టి బొమ్మను తగులబెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతూ మీరు చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. సర్పంచ్ బోగ్గం.రజిత మాట్లడుతూ రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా పినపాక నియోజకవర్గం లోనే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించారు.ఓపిక తో,సమన్వయం తో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ,అభివృద్ధి కి బాటలు వేస్తున్న మా నాయకులు విప్ రేగా ను విమర్శించే నైతిక విలువ కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తీరు మార్చుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ఈశ్వరమ్మ,రాంబాబు, ఉప సర్పంచ్ లు కనకయ్య, ప్రభుదాస్,వెంకటేశ్వర్లు,సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: