మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ నారం రాజశేఖర్ అద్వర్యం లో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ నారం రాజశేఖర్ ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడకుండా, దోమల నివారణను అరికట్టెందుకు ఇంటింటికి తిరిగి ఇంట్లో ప్రతి వారం తోట్లు కడగాలని, నీళ్లు నిలువ ఉండకుండా, మురికి గుంటలు లేకుండా ఉంచాలని, వున్నా చోట ఆయిల్ బాల్స్ వేయించడం జరిగింది. దోమల నివారణను అరికట్టాలని ప్రజలకు అవగాహనా చెయ్యడం జరిగింది. అనంతరం పంచాయతీ సిబ్బంది తో వాటర్ ట్యాంక్స్ క్లిన్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోడం బుచ్చప్ప, సెక్రటరీ సుజాత, వార్డ్ సభ్యులు నారం వెంకటమ్మ, రాంబాబు, సుగుణ, లక్ష్మి, వీరభద్రమ్మ, నాగేశ్వరావు, పుల్లమ్మ, ఆశ కార్యకర్తలు సుశీల, వెంకటమ్మ, నాగమణి, అంగన్వాడి టీచర్స్ సుజాత, శారద, పారిశుధ్య కమిటీ నెంబర్ జమ్మి జయరాజు, గ్రామ యువత, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: