మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ, పండువారిగూడెం గ్రామం లో సర్పంచ్ నారం రాజశేఖర్ అద్వర్యం లో దోమల నివారణను అరికట్టెందుకు ఇంటింటికి తిరిగి నీళ్లు నిల్వ ఆగకుండా, తోట్లు క్లిన్ చెయ్యడం మరియు మురికి గుంటలు లేకుండా చూడాలని, మురికి గుంటలు వున్నా చోట దోమల లిక్విడ్ పోయించడం జరిగింది. ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహనా చెయ్యడం జరిగింది. అనంతరం రోడ్ సైడ్ చెత్త మరియు పిచ్చి మొక్కలను క్లిన్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సెక్రటరీ సుజాత, వార్డ్ సభ్యులు సీసం నాగేశ్వరావు, మడకం లక్ష్మి, బేతి రాంబాబు, ఆశ కార్యకర్త నాగమణి, మరియు పంచాయతీ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: