CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పిల్లలు పుట్టడం లేదన్న ఆవేదనతో ఓ వక్తి ఆత్మహత్య

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట: పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి పంచాయతీ, గంగారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గంగారం గ్రామానికి చెందిన కూచిపూడి పనేంద్ర (35) 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. కూచిపూడి పనేంద్ర దంపతులకు సంతానం లేకపోవడం వలన పనేంద్ర తన భార్యను పలు ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. అప్పటి నుంచి పిల్లలు పుట్టరని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో పనేంద్ర గత కొన్ని రోజుల నుంచి ఆవేదన గురవుతున్నాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో, ఎవరూలేని సమయంలో సోమవారం సాయంత్రం 8 గంటల సమయంలో గ్రామ శివారు లోని కొంత భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న షెడ్ దగ్గరకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, గ్రామస్తులు ఎస్ఐ అరుణ కు సమాచారం ఇవ్వగా, సమాచారం అందుకున్న ఎస్సై అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు.

Share it:

Post A Comment: