CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణా లో దళితుల మీద జరిగే దాడులనువెంటనే ఆపండి

Share it:

 



*దళితులపై జరిగే అత్యాచారాలను నిరోధించండి దోషులకు కఠిన శిక్ష విదించండి

*గుగ్గిళ్ల సురేష్ మాదిగ డిమాండ్


మన్యం టీవీ మంగపేట.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు దళిత బందు దళితులకు ఇస్తాను అని ప్రకటించడం హర్షనీయం, అంత కంటే ముందు దళితులపై జరిగే భౌతిక దాడులను, అత్యాచారాలను నిరోధించండి. అప్పుడు మీరు ప్రకటించిన దళిత బంధుకు అర్ధం పరమార్ధం ఉంటుంది. మీరే దళిత జాతి అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం అంటారు మీరె దళితులమీద దాడులు చేపిస్తున్నారు ఇదేమి రాజకీయం మీరే చెప్పాలి.తెలంగాణ వస్తే చదువుకున్న వారికీ ఉద్యోగాలు వస్తాయి అని నా తోటి సోదరులు ప్రాణ త్యాగాలు చేసారు, అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోయే. ఆ నాడు కెసిఆర్ విద్యార్థులను ఉసిగొల్పి వారిని సమిదలుగా చేసి వారి ప్రాణాలు పోయేలా చేసి ఇప్పుడు ఉద్యోగాలు లేవు ఎక్కడనుండి తేవాలి అంటే తెలంగాణా వస్తే నియామకాలు పెరుగతాయి అన్నావ్ ఇప్పుడు నియామకాలు ఏవి, ఇంటికో ఉద్యోగం అంటివి, ఎందుకు ఇస్తాను అని వాగ్దానం ఇవ్వాలి ఎందుకు మా మా ప్రాణాలను తీసే ప్రయత్నం చేయాలి కెసిఆర్ గుర్తు పెట్టుకోండి ఉస్మానియా యూనివర్సిటీ దళిత విద్యార్థులు మరియు ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుకున్న ప్రతి విద్యార్థి తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడి కిరోషన్ పోసుకొని చనిపోయారు అలాంటి యూనివర్సిటీ దళిత విద్యార్థులను ఇలా కొట్టిస్తున్నారు. ఒక పక్కన దళిత బందు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తాను అనిచెప్తూ మరో పక్కన దళిత విద్యార్థి ని పాల్వాయి నరేష్ మదిగ పి ఎచ్ డి స్కాలర్ మీద తెరాస గుండగాళ్ళు దాడి చేయడం కరెక్టు కాదు. అదే విధంగా మేము దళితులం కూడా తిరగపడతే ఎవరినైనా లెక్కచేయం దళితుడు చావడానికైనా చంపడా నికైనా సిద్దపడుతాడు కానీ మన తెలంగాణ లో శాంతి భద్రతల ఉండాలని అనుకుంటూ ఆ పని విరమించుకుంటున్నారు దళితులు అంటూ ఎమ్మార్పీస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ గుండెట్టి జంపయ్మాదిగ లంజపెళ్లి పున్నారావు మాదిగ,ఆదినారాయణ మాదిగ, చిప్పనపెళ్లి బాబు మాదిగ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్దిమీద చేయి చేసుకున్న దుండగులను వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వారిని శిక్ష వేయాలని ఎమ్మార్పీస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసారు.

Share it:

Post A Comment: