మన్యం టీవీ ఏటూరు నాగారం
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కమలాపూర్ బిల్ట్ కార్మికులు సోమవారం భిక్షాటన చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా బిల్ట్ కర్మాగారం మూతపడడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వారి కుటుంబాలు వీధిన పడ్డారు.పలుమార్లు దశలవారీగా కార్మికులు ఆందోళన బాట బట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం నిధులు కేటాయించి వారిని ఆదుకుంటామని హామీలు ఇచ్చి హామీలు కాగితాలకే పరిమితం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ తాము తమ కుటుంబాలు రోడ్డున పడి బిక్షం ఎత్తుకునే పరిస్థితి ఏర్పడిందని వారు కన్నీరు పెట్టారు.ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.ఈకార్యక్రమంలో పలువురు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: