CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి సిపిఐ డిమాండ్..

Share it:

 


మండలంలోని అన్ని పంచాయతీలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.!

                                            


మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లో ఎల్లంకి మధు అధ్యక్షతన సిపిఐ గ్రామ శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు డెంగ్యూ మలేరియా జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకొని వైద్య శాఖ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. మండలంలో పలు గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని, వైద్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ పాలకవర్గాలు గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టేలా అదికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అపరిశుభ్రత వాతావరణం గ్రామాల్లో నెలకొన్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చింత స్వరాజ్యరావు, ఎస్ కె నాగులు మీరా, కొండ వీరయ్య ఎస్.కె చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: