CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ ఎమ్మెల్యే కు దక్కిన గౌరవాన్ని తొక్కేయాలని చూస్తే సహించేదిలేదు.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: ఒక్క ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కి దక్కిన ప్రభుత్వ విప్ గౌరవాన్ని తొక్కేయాలని చూస్తే ఉరుకునే ప్రసక్తెలేదని కరకగూడెం తుడుందెబ్బ సంఘం డిమాండు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జరిగిన బహిరంగ సభ,అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా ఎర్పాటు చేసిన ప్లెక్షీ లో ప్రోటోకాల్ ప్రకారం ఆదివాసీ ఎమ్మెల్యే పోటో ఎర్పాటు చేయకుండా అవమానించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు, అతని తనయుడు రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరుని మండల తుడుందెబ్బ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.అంబేద్కర్ సాక్షిగా అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన ఎమ్మెల్యే రేగా కాంతారావు ని ప్రోటోకాల్ పాటించకుండా అవమాన పరిచిన గిరిజనేతర ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు, అతని తనయుడు రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు. గిరిజనేతర ఎమ్మెల్యే అతని తనయుడు వాళ్ల కనుసన్నుల్లో పనిచేసే అధికారులకు గిరిజనుల హక్కులను అన్యాయాలను అణిచి వేయాలని ఆలోచనలు మాను కోవాలని, లేక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు సూతరి నాగేశ్వరరావు, సిద్దబోయిన శ్రీకాంత్ ,కొమరం రాంగోపాల్, ఊకె గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: