మన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం లోని నర్సాపురం గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు జోరువానలో సైతం నిర్దేశించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పొదెం వీరయ్య తో కలిసి శంకుస్థాపన చేశారు. నర్సాపురం గ్రామంలో హెచ్ యు డి సి ఓ మోడల్ విలేజ్ స్కీమ్ కింద 70 లక్ష తో చేపట్ట ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీ పరిధిలో డి ఎం ఎఫ్ టి నిధులు 1.06కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. అలానే నర్సాపురం పల్లె ప్రకృతి వనం ప్రారంభించారు అనంతరం రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ ,జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ,ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ ,అలానే టిఆర్ఎస్ మండల నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: