మన్యం టీవి, దుమ్ముగూడెం:
మండలంలోని బండారిగూడెం గ్రామానికి చెందిన బుద్దుల కామయ్య కి ఇద్దరు పిల్లలు అమ్మాయి మరియు ఒక్క అబ్బాయి సంతానం. వారిలో వంశీ (19 ) దుమ్ముగూడెం లో ఇంటర్ చదువుతున్నాడు ప్రస్తుతం ఇంటిదగ్గర వుంటు తన తండ్రి కామయ్య కు వ్యవసాయ పనులలో సహాయం చేకుంటు వుండేవాడు .ఈ క్రమంలో మద్యాహ్నం 02:00గం: సమయంలో తమ ఇంటి సమీపంలో గల మిరప నారుకు నీళ్ళు పట్టి మోటార్ స్విచ్ అపే క్రమంలో స్విచ్ వద్ద కరెంట్ ఎర్త్ అవడంతో కరెంట్ షాక్ తగిలి కింద పడిపోవడం జరిగింది.
చుట్టుపక్కల వాళ్ళు గమనించి వేంటనే తండ్రి కామయ్యకు సమాచారం అందించారు.కామయ్య వెంటనే వంశీని భద్రాచలం ఏరియా అసుపత్రికి తికొని వెళ్ళగా డాక్టర్ పరిక్షంచి వంశీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నా కుమారుడు వంశీ విద్యుదాఘాతంతో మృతి చెందాడని కామయ్య బోరున విలపిస్తూ చెప్పాడు. మృతుని తండ్రి పిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: