మన్యం టీవీ ఏటూరు నాగారం
హైదరాబాద్ లో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావును మంగళవారం కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో గత 2020 వ సంవత్సరంలో తమరి యొక్క పంచాయితీ రాజ్ శాఖ నిధులు నుండి 10 కోట్లు రూపాయలు మరియు ఈ 2021 సంవత్సరం లో 4 కోట్లు రూపాయలు సీసీ రోడ్లు మంజూరీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాములు తెలుపుతూ.. మరియు ములుగు నియోజకవర్గంలో 9 (గంగారం, కొత్తగూడ ,ఏటురునాగారం,మంగపేట,కన్నాయిగూడెం,తాడ్వాయి,గోవిందరావుపేట,వెంకటాపుర్,ములుగు) మండలాలకు కనీస అంతర్గత రోడ్ల సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ములుగు నియోకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ది కోసం 5 కోట్లు నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రిగారు సానుకూలంగా స్పందించి ములుగు నియోజకవర్గం లోని సమస్యలు పరిష్కరిస్తమని హామీ ఇవ్వడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మలోత్ కవిత, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు భవాని రెడ్డి పాల్గొన్నారు.
Post A Comment: