CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా.

Share it:

 


 అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు

 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండల పరిధిలో భాగంగా ఆయన తుంగారం గ్రామంలో వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వెంకటాపురం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయిన రైతు చెన్న బోయిన నారాయణ (59) కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మద్దూకురు గ్రామం చెందిన నల్లమోతు సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ పై ఉందన్నారు. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాభిమానాన్ని పొందాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మాల బొజ్జ నాయక్, ఉపాధ్యక్షులు ఏడుకొండలు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, టిఆర్ఎస్ నాయకులు మేడ మోహన్ రావు, ఉన్నం నాగరాజు, గాదె శివప్రసాద్, దారా బాబు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: