CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాతో వృద్ధురాలు మృతి... అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్

Share it:

 



 మన్యం టీవీ, అశ్వరావుపేట: కరోనాతో మృతి చెందిన ఓ వృద్ధురాలు ను గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో సర్పంచ్ అంత్యక్రియలు జరిపి మానవత్వాన్ని చాటుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, పేరాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధి ఎఎస్ఆర్ కాలనీకి చెందిన చారుగుడ్ల జ్ఞాన సరస్వతి (80) అశ్వరావుపేట మండల ప్రభుత్వ హాస్పటల్లో కరోనాతో మృతి చెందడం జరిగింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఎవరు అందుబాటులో లేకపోవడం వలన ఆ హాస్పిటల్ డాక్టర్ అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ నార్లపాటి సుమతికి ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో స్పందించిన సర్పంచ్ సుమతి గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా గ్రామపంచాయతీ ట్రాక్టర్లో మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నార్లపాటి శ్రీనివాస రావు, మహేష్, ఉదయ్, హరికృష్ణ, గ్రామపంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Share it:

Post A Comment: