మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి (ఆగస్టు 09):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మహబూబ్ నగర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం పక్కన గల స్థలంలో నిర్ణయించిన బృహత్ పల్లె ప్రకృతి వనం యొక్క పనులను అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత, పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అగ్గి కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్-కె భద్రకాళి, అటవీశాఖ ఎఫ్ఆర్వో-శ్రీనివాస రావు,ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ-విజయ్, (ఈజీఎస్) ఏపీఓ-ప్రమీళ, (ఈజీఎస్) టిఎ-జ్యోతి, పద్మ, గ్రామ పెద్దలు వేముల హరీష్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: