👉ఆందోళనలో డిపాజిటర్లు, ఖాతాదారులు
మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో భద్రాద్రి కోపరేటివ్ బ్యాంకు రెండు కోట్ల రూపాయలు గోల్మాల్ అయినట్లు అయినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో డిపాజిటర్లు, ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గత మూడు రోజులుగా భద్రాద్రి కోపరేటివ్ బ్యాంకు లో ఆడిటింగ్ కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో బ్యాంకు పట్ల ఖాతాదారుల్లో నెలకొంది. మణుగూరు పట్టణానికి చెందిన అనేక మంది వ్యాపారస్తులు ఈ బ్యాంకు లోనే లావాదేవీలు కొనసాగిస్తున్నారు. బాధిత వ్యక్తులు శుక్రవారం రాత్రి విప్ , పినపాక ఎమ్మెల్యే కాంతారావును ఆశ్రయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కోపరేటివ్ బ్యాంకు లో ఎలాంటి అవకతవకలు జరగలేదని సంబంధిత బ్యాంకు యాజమాన్యం తెలపడం గమనార్హం.
Post A Comment: