మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: మండలంలోని పోలీస్ స్టేషన్ లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు మాట్లాడుతూ మండలంలో ప్రజలందరూ శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా ప్రవర్తించాలని, స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్యం కు అర్థం లేకుండా చేయొద్దని, అందుకు అందరూ సహకరించాలని అన్నారు. ఈ వేడుకల్లో ఎంపిపి సున్నం లలిత, అన్నపురెడ్డిపల్లి ఉప సర్పంచ్ పర్సా వెంకటేశ్వరరావు, జంగాల శ్రీనివాసరావు, చిన్నారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: