CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్వసభ్య సమావేశానికి సగం అధికారులు డుమ్మా

Share it:

 

  • సర్వసభ్య సమావేశానికి సగం   అధికారులు  డుమ్మా
  •  సమావేశాలకు ప్రోటోకాల్ పాటించని అధికారులు
  •  పల్లె ప్రగతి లో మండలంలో సగం శాఖల పనితీరు నిల్

 గుండాల ఆళ్ల పల్లి ఆగస్ట్ 5 (మన్యం మనుగడ) సర్వసభ్య సమావేశానికి  సగానికిపైగా అధికారులు  డుమ్మా కొట్టారు. ఆళ్ల పల్లి మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించగా 22 శాఖలకు గాను  పన్నెండు శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. సగానికి సగం అధికారులు హాజరు కాకపోవడం పట్ల సర్వసభ్య సమావేశం పై అధికారులకు  ఎంత శ్రద్ధ ఉందో ఈ ఘటన తెలియజేస్తుంది. ముఖ్యంగా హాజరు కావలసిన  అటవీశాఖ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. మిషన్ భగీరథ నీళ్లు అన్ని  పంచాయతీలోని గ్రామాలకు రావట్లేదని  ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ కిషోర్ పై వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితోపాటు పల్లె ప్రగతి లో అసంపూర్తిగా  పనులు చేసిన అధికారులపై ఎంపీపీ  మంజు  భార్గవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ పనులు  అక్కడ పెండింగ్ ఉండడం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యలు పరిష్కరిస్తామని  అధికారులు తెలిపారు. ఐ సి డి ఎస్  సూపర్వైజర్ పర్యవేక్షణ లోపంతో  పాలు, కోడిగుడ్ల లో నాణ్యత లోపిస్తుంది అని ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు . పల్లె ప్రగతి లో మిడిల్ పోల్స్ సగానికిపైగా గ్రామాల్లో వేయలేదని విద్యుత్ శాఖ అధికారులపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారుల తీరు మారకుంటే వేటు తప్పదని ఎంపీపీ మంజు భార్గవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  జెడ్ పి టి సి కొమరం హనుమంతు, ఎంపీడీవో మంగమ్మ , పిఎసిఎస్ చైర్మన్ రామయ్య , సర్పంచులు అధికారులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: