మన్యం టీవీ, అశ్వాపురం:మొండికుంట గ్రామ పంచాయతీ లోని ప్రాథమిక పాఠశాల లో ఐటీసీ బంగారు భవిష్యత్తు వాష్ ప్రోగ్రాం వారు టాయిలెట్స్ శాంక్షన్ చేసినందున ఈ రోజు సర్పంచ్ మర్రి మల్లారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ టాయిలెట్స్ కు మొత్తం ఖర్చు 3,40000/-రూపాయలు. ఇందులో 20% గ్రామ పంచాయతీ భరిస్తుంది.మిగతా 80% ఐటీసీ బంగారు భవిష్యత్ వాష్ ప్రోగ్రాం వారు భరిస్తారు. నిర్మాణం ఐటీసీ బంగారు భవిష్యత్తు వాసు ప్రోగ్రాం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ నరేష్, ఐటీసీ బంగారు భవిష్యత్తు వాష్ ప్రోగ్రాం నిర్వాహకులు గడ్డం వెంకటేశ్వర్లు, ఇంజనీర్ సుబ్బయ్య, ప్రధానోపాధ్యాయురాలు కనకమహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: