మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లో శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన జరిగింది. టేకులపల్లి నుండి ఇల్లందు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రవీణ్ అనే యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. టేకులపల్లి వెళ్తున్న ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ సంఘటన స్థలంలో యువకుడి మృతదేహాన్ని చూసి వెంటనే ఇల్లందు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Post A Comment: