👉🏻తీవ్రంగా ఖండించిన ఆదివాసీ జేఏసీ
👉🏻 మండల అధ్యక్షులు పోడియం అనిల్ కుమార్.
మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండలం స్థానిక ఆదివాసి భవన్ కార్యాలయం వద్ద అశ్వాపురం మండల ఆదివాసి జేఏసీ అధ్యక్షులు పొడియం అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన విలేకర్ల సమావేశంలో శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొత్తగూడెంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ లో భాగంగా అంబేద్కర్ సాక్షిగా ఆదివాసి ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రోటోకాల్ విషయంలో అవమానపరిచి నటువంటి కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు మరియు వారి కుమారుడు వనమా రాఘవ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.లేనియెడల ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో వారి గృహనిర్బంధం
చేపట్టడానికైనా వెనకాడబోమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా గిరిజన ఆదివాసీ జిల్లాగా ఉందని విషయం మర్చిపోయి ఒక ఆదివాసి గిరిజన ముద్దుబిడ్డ అయినటువంటి మంత్రి క్యాడర్ తో సమానులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని ప్రోటోకాల్ విషయంలో అవమానపరచడం బాధాకరమని అశ్వాపురం మండల ఆదివాసి జేఏసీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ నాయకులు చాప ముత్తయ్య కుంజా రామారావు కల్లూరి లక్ష్మీనారాయణ తుడుం దెబ్బ నాయకులు తంగెళ్ల భద్రయ్య ఉద్యోగ సంఘాల నాయకులు పూణెం వెంకటేశ్వర్లు ఇర్పా వెంకటేశ్వర్లు ఆదివాసి సర్పంచులు ఎం పి టి సి లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: