చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: పోడు రైతుల పై అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలని సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు డిమాండ్ చేశారు.సోమవారం సీతాయిగూడెం పోడు భూములను పరిశీలించి, పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గుర్రం రవి, రాము ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోడు రైతుల పై అమానుషంగా ప్రవర్తించడం సరికాదన్నారు.పంటలను ధ్వంసం చేయడం ఎంతవరకు సబబుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎస్ కె సాబిర్ హుస్సేన్, బొర్ర సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: