మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఐటిడిఎ కార్యాలయంలో శుక్రవారం జయశంకర్ సార్ 87 వ జయంతి సందర్భంగా ఐటిడిఎ పిఓ హనుమంతు కె జెండా గే ఐఏఎస్ హాజరై పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పీవో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకై కలలుకన్న మహానీయుడు భావితరాలకు ప్రత్యేక రాష్ట్ర ప్రాముఖ్యత తెలిపిన ఆచార్యులు మలిదశ ఉద్యమ కారులకు ఊపిరి పోసిన మార్గదర్శకులు స్ఫూర్తి దాత అని అన్నారు.స్వరాష్ట్ర మే శ్వాసగా ఆత్మగౌరవం ధ్యాసగా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ అస్తిత్వం కోసం జీవితాన్ని అర్పించిన మహనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ పీ ఓ వసంతరావు,ఏవో టి.వి. ఆర్ దామోదర స్వామి,ఏఏఓ రాజ్ కుమార్,పిఏఓ లక్ష్మీ ప్రసన్న,మేనేజర్ భూక్య లాల్ నాయక్, పిసా జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, ఆర్ఓఎప్ఆర్ డిప్యూటీ తాసిల్దారులు ఎస్ డి సి మరియు ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది,కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: