CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు నిత్యావసర సరుకులు వితరణ

Share it:



మన్యం టీవీ,అశ్వాపురం:- ఈ రోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు  ఆదేశాల మేరకు రేషన్ డీలర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొడాలి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు నజీర్ షోను, అంబెడ్కర్ యువజన సంఘం నాయకులు జూపెల్లి కిరణ్ సహాయసహకారాలతో అశ్వాపురం మండలం అమెర్థ పంచాయతీలోని  తెల్లవారిగుంపు గ్రామానికి చెందిన షేక్ జాజికి 25కేజిల బియ్యం, నిత్యావసర సరుకులు కురగాయలు అందించడం జరిగింది. వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా షేక్ జాజి అనే మహిళ పేదరీకంలో మగ్గుతూ, కరోనాతో ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతుంది. ఆమె భర్త ప్రమాదవశాత్తు కుడి చెయ్యి, ఎడమ కన్ను కొల్పోవడం జరిగింది. మతిస్థిమితం లేని వయస్సుకు వచ్చిన కుమారుడు ఉన్నాడు. విటన్నిటిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో ఆలోచించి నెల రోజులకు సరిపడ బియ్యం, నిత్యావసర సరుకులు కురగాయలు, పాలు, బ్రెడ్లు, గుడ్లు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు నజీర్ షోను, అంబెడ్కర్ యువజన నాయకులు జూపెల్లీ కిరణ్, అమెర్థ పంచాయతీ ప్రధాన కార్యదర్శి మోదుగు వంశీ, రావుల అజయ్, తెల్లం లక్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: