CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంత్రి మల్లారెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

Share it:

 


*మంత్రి పదవికి రాజీనామా చేయాలి. 

*ములుగు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్ డిమాండ్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీద అనుచిత వాక్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి వెంటనే రాజీనామా చేయాలి అని ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవిచందర్ డిమాండ్ చేశారు. నిన్న మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీద అనుచిత వాక్యల కు నిరసనగా గురువారం ములుగు జిల్లా కేంద్రం లో యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపి, దిష్టి బొమ్మ దహనం చేసి మంత్రి కి వ్యతిరేకం గా నినాదాలు చేశారు.అనంతరం ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవిచందర్ మాట్లాడుతూ రాజ్యాంగ హోదా లో మంత్రి పదవిలో ఉన్న మల్లారెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మీద అనుచిత వాక్యలు చేసినందుకు వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.ఇలాంటి వాళ్ళు మంత్రి పదవిలో ఉండటం వల్లనే రాష్ట్రము ఇలా దివాళాతీసింది అని, మంత్రి మల్లారెడ్డి వెంటనే పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్ లో మంత్రుల కార్యక్రమాలను ఎక్కడకక్కడ అడ్డుకుంటాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ రెడ్డి, గౌతమ్,మండల అధ్యక్షులు చంద్ పాషా,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, శ్రీను,మైనారిటీ మండల అధ్యక్షులు షకీల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుమన్ నియోజకవర్గం అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్, మంగపేట మండల ఉపాధ్యక్షులు తుడి భగవాన్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, చంద్రకాంత్,అయ్యూరి యణయ్య,మాసరెడ్డి వెంకట్ రెడ్డి,చాద మల్లయ్య,తారక్, రాహుల్,దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: