CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలోని దళిత గిరిజనులకు 10 లక్షలు అందజేయాలి

Share it:

 


*ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం టీవీ ఏటూరు నాగారం

 ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో దళిత,గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలన్నింటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల లోని 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క హాజరై మాట్లాడుతూ ఒక్క హుజురాబాద్ నియోజకవర్గం కాకుండా బడుగు బలహీన వర్గాల కుటుంబాల అన్నింటికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఓట్ల కోసం జిమ్మిక్కులు చేసే కేసీఆర్ గారు దళిత బంధు పథకం పేరిట కొత్త మోసానికి తెర లేపారు అని,ఉప ఎన్నికలు గెలవడం కోసమే దళితులకు దళిత బంధు ఇస్తానని మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాడని అన్నారు.అలాగే నిజంగా దళితుల మీద కేసీఆర్ గారికి ప్రేమాభిమానాలు ఉంటే, దళితుల అభివృద్దే కోరుకుంటే రాష్ట్రం మొత్తం దళిత బంధు అమలు చేసి 17 లక్షల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలి కానీ,ఒక్క హుజురాబాద్ నియోజకవర్గానికి మాత్రం ఇస్తా అనడం ఏంటి అని ప్రశ్నించారు.ఒక్క ఎస్సి కులానికి కాకుండా రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాలన్నింటికి దళిత బంధు ప్రకటించేలా కాంగ్రెస్ పార్టీ తరుపున ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ గారు తన బుద్ది మార్చుకుని మోసపూరిత వాగ్దానాలు చేయకుండా ఇదివరకు ఇచ్చిన హామీలు కూడా వెంటనే అమలు చేయాలని ముఖ్యంగా దళితులకు మూడు ఎకరాల భూమి,అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, పంట రుణమాఫీ చేయాలని అన్నారు.లేకపోతే ప్రజల తరుపున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ,నేను ఎప్పుడు సిద్ధమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కూచన రవళి రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్,జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్,జిల్లా ఎస్.సి సెల్ అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి,మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి.ఆయుబ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ ములుగు మండల అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, ములుగు మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా,ములుగు ఎంపీటీసీ మావూరపు తిరుపతి రెడ్డి,మంగపేట మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,ఏటూరునాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు, జిల్లాలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు,మహిళ నాయకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: