మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా బుధవారం ఇల్లందులో జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లందు లోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురళి కృష్ణ మాట్లాడుతూ. . ఎంపీ ధర్మపురి అరవింద్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు బిజెపి ముందుంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంజిత్ కోరి, కళ్యాణ్ కుమార్, భరత్, సాయి, పవన్,తేజ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: