👉వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా
కార్యదర్శి కనకయ్య. గ్రామాలలో ఏజెన్సీ లో విషజ్వరాలతో పేదలు,గిరిజనులు బాదపడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు.మాదారం లో జరిగిన శాఖమహా సభలో పాల్గొని మాట్లాడుతూ,ఇప్పటికే కరోనాతో వణికిపోయిన ప్రజలు ఇప్పుడు సీజనల్ వ్యాదులతో ప్రాణాలను కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారని,ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక అనేక గ్రామాల్లో పేదలు జ్వరం తో మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదని,ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ స్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని,ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని,డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో మండలకార్యదర్శి ముదిగొండ రాంబాబు, వూకంటి రవికుమార్,ఎఐటియుసి మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, వినోద్,చంద్రశేఖర్, నాగబాబు, మంగపతి, నీల,ఇందిర తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: