. ఫారెస్ట్ డివిజనల్ అధికారి అప్పయ్య.
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని కొత్తగూడెం ఫారెస్ట్ అధికారి అప్పయ్య అన్నారు. బుధవారం మద్దుకూరు, బెండలపాడు, ఫారెస్ట్ బీట్ ను ఆయన పరిశీలించారు. ప్లాంటేషన్ పనులు కనిగిరి గుట్ట లో నిర్మిస్తున్న వాటర్ టవర్ ను ఆయన సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పోడు పేరుతో అడవులు నరికితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్సిజన్ కొన్ని రోజులు పోవాలంటే ప్రతి ఒక్కరు నాటాలి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని వాటిని సంరక్షించడంతో పాటు మన వంతుగా మొక్కలు నాటాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ సిహెచ్ శ్రీనివాసరావు, సెక్షన్,బీట్ అధికారులు పాల్గొన్నారు
Post A Comment: