చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : తిప్పన పల్లి పంచాయతీ, మహమ్మద్ నగర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం పనులను పొడు దారులు అడ్డుకున్నారు. బుధవారం పకృతి పనులు జరుగుతుండగా పోడు దారులు వచ్చి అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీవో అన్నపూర్ణ వచ్చి పోడు దారులను సముదాయించారు. పోడు దారుల పత్రాలను పరిశీలించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఈ సందర్భం గా పోడు దారులు మాట్లాడుతూ 1998 నుంచి పోడు సాగు చేసుకుంటున్నామని 2000 సంవత్సరంలో మా పై అనగా 24 మంది పై ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టి వరంగల్ జైలుకు పంపారు. నాటి నుండి నేటి వరకు పోరాటాలు చేస్తున్నామని పట్టాలు వస్తాయని చెప్పారు కానీ నేటికి రాలేదన్నారు. మాకు భూమిని పల్లె పకృతి వనాన్ని కి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో పోటు దారులు అర్జున, సాయమ్మ, కమల, దుంప వీరయ్య, బజార్, రమణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: