👉 జ్వరం వస్తే,ప్రభుత్వ వైద్యులు ను సంప్రదించాలి
👉పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
వైద్య అధికారులు గ్రామలలో హెల్త్ క్యాంపు నిర్వహించాలి
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మణుగూరు ఎంపిపి కారం. విజయకుమారి అన్నారు. సీజనల్ వ్యాధులు,డెంగ్యూ, టైఫాయిడ్,మల్లేరియా,జ్వరాలు పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అన్నారు.ఇంటి అవరణను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి,అవి కుట్టడం వల్ల జ్వరాలు వస్తాయని తెలిపారు.అన్ని పంచాయతీ లలో సర్పంచ్ లు, కార్యదర్శులు గ్రామాలలో శానిటేషన్ చేపించాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో వైద్య శాఖ అధికారులు,హెల్త్ క్యాంపు లు నిర్వహించలి అన్నారు. ఎవరికైనా జ్వరం వస్తే దగ్గర లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని సూచించారు. వ్యాధుల నివారణకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని, కావలసిన నిధులను మంజూరు చేస్తుంది అన్నారు.ప్రజల ఆరోగ్యం పై టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది తెలిపారు.
Post A Comment: