పినపాక ప్రెస్ క్లబ్ తరపున తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
మన్యం మనుగడ, పినపాక:
అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడే జర్నలిస్టులపై దాడులు చేయడం తగదని, పినపాక ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది.కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో వి5 రిపోర్టర్ ఆదికేశవులును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని,భవిష్యత్తులో ఏ రిపోర్టర్ కు ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులపై ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అమలు పరచాలని నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేప్రసక్తే లేదని పినపాక మండలానికి చెందిన పాత్రికేయ మిత్రులు పినపాక తాహసిల్దార్ విక్రమ్ కుమార్ కి దరఖాస్తు సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులు బూర శంకర్,బిల్లా నాగేంద్రబాబు సనప భరత్,నిట్టా వెంకటేశ్వర్లు,దొడ్డి శ్రీనివాస్,కట్టా శ్రీనివాస్, గంగాధర్, తదితర పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
Post A Comment: